English | Telugu

వరద బాధితులను ఆదుకోవడానికి కదిలిన టాలీవుడ్!

తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ కష్ట కాలంలో తెలుగు ప్రజలకు అండగా నిలబడటానికి తెలుగు సినీ పరిశ్రమ కదిలింది. ఇప్పటికే ఎందరో సినీ స్టార్స్ లక్షలు, కోట్లలో తమకు తోచిన సాయాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాదు సినీ పరిశ్రమ అంతా ఒక తాటిపైకి వచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు "వరద బాధితుల కొరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు సినీ పరిశ్రమ చేయూత" పేరుతో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, దర్శకుడు రాఘవేంద్రరావు సహా పలువురు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.