English | Telugu

నిర్మాతల మండలి ఆవేదన

నిర్మాతల మండలి ఆవేదన చెందింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర నిర్మాతల మండలి(ఎ.పి.ప్రొడ్యూసర్స్ కౌన్సిల్)వారు ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో గత వారం రోజులుగా ఎ.పి.ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె కారణంగా నిర్మాతలు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో, తరువాత సినిమా తీయటానికి వారికి కళాకారుల డేట్లు దొరక్క ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారో మీడియాకు తెలియజేశారు. వారు ఇంకా మాట్లాడుతూ ప్రభుత్వ లేబర్ యాక్ట్ కన్నా, చెన్నై, కర్ణాటక, ముంబై కన్నా తెలుగు సినీ పరిశ్రమలోనే సినీ కార్మికులకు ఎక్కువ జీతాలిస్తున్నామనీ, ప్రస్తుతం వారు చేస్తున్న సమ్మెకు 32 శాతం వారి జీతాలను పెంచామనీ, అందుకు 17 క్రాఫ్టులు అంగీకారం తెలిపినా, కొందరు నాయకుల సంకుచిత,దురాశాపూరిత ధోరణుల మూలంగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిందని వారన్నారు.


నిర్మాతలు ఇంకా మాట్లాడుతూ వారు సమ్మె విరమించి సినీ నిర్మాణాలకు సహకరిస్తే బాగుంటుందనీ, లేకుంటే తాము ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి లేబర్ యాక్ట్ కన్నా ఎంత ఎక్కువ ఇస్తున్నామో తెలియజేసి,వీరు రాకపోతే తమకు నచ్చిన వారితో తమ సినిమాలను నిర్మించుకుంటామనీ అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, స్రవంతి రవికిశోర్, ప్రసన్న కుమార్, దిల్ రాజు, దమ్మాలపాటి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.