English | Telugu

అనీష్ కురువిల్లా దర్శకత్వంలో సిద్ధార్థ

అనీష్ కురువిల్లా దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా ఒక చిత్రంలో నటించనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఎన్నో హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల సొంత సంస్థ ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ కి ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా ఉండి, తను స్వయంగా వ్రాసి దర్శకత్వం వహించి "ఆవకాయ్ బిర్యాని" అనే సినిమా తీసిన వ్యక్తే ఈ అనీష్ కురువిల్లా. ఎప్పుడూ కొత్త దర్శకులను ప్రోత్సహించే హీరో సిద్ధార్థ మంచి కథ ఉంటే అనీష్ కురువిల్లా దర్శకత్వంలో నటిస్తానని అన్నారట.


ఈ అనీష్ కురువిల్లా త్వరలో సిద్ధార్థ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న "ఓ మై ఫ్రెండ్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే అనీష్ కురువిల్లా దర్శకత్వంలోని చిత్రంలో సిద్ధార్థ హీరోగా నటిస్తారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.