English | Telugu

'గేమ్ ఛేంజర్' నుంచి కీలక అప్డేట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్-శంకర్ కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.

వెయ్యి మందికి పైగా ఫైటర్లతో 'గేమ్ ఛేంజర్' క్లైమాక్స్ ను అత్యంత భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయిందని తాజాగా దర్శకుడు శంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేకాదు వెంటనే 'ఇండియన్-2' షూటింగ్ లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. శంకర్ ఓ వైపు రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' చేస్తూనే, మరోవైపు కమల్ హాసన్ తో 'ఇండియన్-2' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్ పారలల్ జరుగుతోంది.

'గేమ్ ఛేంజర్'లో కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్‌, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.