English | Telugu

ఏంటి కవిత గారు దణ్ణం పెట్టడం కూడా చేత కాదా!

సీనియర్ నటి కవిత.. తెలుగు సినిమా చరిత్రలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కె విశ్వనాథ్ డైరెక్షన్ లో సిరి సిరి మువ్వతో తెలుగులో నటిగా అరంగేట్రం చేసిన కవిత.. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలైంది. అయితే కవిత తన వ్యక్తిగత జీవితం గురించి పొలిటికల్ లైఫ్ గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

మీకు ఎన్టీఆర్ ఎలా తెలుసని ప్రశ్నించగా.. "మేం చెన్నైలో టీనగర్ లో ఒక పార్క్ దగ్గర ఉండేవాళ్ళం. ఆ పార్క్ కి అటువైపు మేము.. ఇటువైపు ఎన్టీగారు ఉండేవారు. నేను మా అమ్మ కలిసి పొద్దున్నే నాలుగు గంటలకు ఎన్టీఆర్ గారిని దర్శించుకోడానికి వెళ్ళేవాళ్ళం. ఆయనని చూడగానే కాళ్ళకి దండం పెట్టేవాళ్ళం. ఆయనని చూడటానికి ఎక్కడెక్కడి నుండో జనాలు బస్సుల్లో వచ్చేచారు.

తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నవాళ్ళు.. తర్వాత ఎన్టీఆర్ గారిని దర్శించుకునేవాళ్ళు. మా అమ్మ , ఎన్టీఆర్ గారు మంచి స్నేహితులు.. అలా మా అమ్మ నన్ను ఆయనకు పరిచయం చేసింది. ఆ తర్వాత లాయర్ విశ్వనాథ్ సినిమాలో ఆయనకి చెల్లెలి పాత్రలో నటించాను" అని కవిత చెప్పింది.తను సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి పొలిటికల్ ర్యాలీలో పాల్గొందంట. అయితే అలా ర్యాలీలో వెళ్తున్నప్పుడు ఆయన ఒక కుగ్రామంలో ఒక చెట్టుకింద దుప్పటి వేసుకుని పడుకున్నాడు. ఎప్పుడు ఆయన సామాన్యుడినే అని చెప్పేవారు అని తెలిపింది.

ఎన్టీఆర్ గారితో ఎన్ని సినిమాలలో నటించారని ప్రశ్నించగా.. "చాలా సినిమాలలో చేసాను.‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా షూటింగ్ కోసం కడప వెళ్ళాం. అక్కడ నేను ఒక చెట్టు వెనకాల ఉన్నాను. అక్కడ ఆశ్రమంలో ఎన్టీఆర్ గారు ఉన్నారు.. అక్కడ నుండి మెగాఫోన్ లో మాట్లాడుతున్నారు నాకర్థం కాలేదు.. దాంతో కాసేపటికి హరికృష్ణ గారు నా దగ్గరికి వచ్చి తప్పుగా దణ్ణం పెట్డమని చెప్పారు. దాంతో నేను అలాగే చేసాను. దానికి ఎన్టీఆర్ గారు పిలిచి.. ఏంటి కవిత గారు దణ్ణం పెట్టడం కూడా చేత కాదా అని అందరిముందు అనేసరికి నేను ఏడ్చేసాను.

ఆ తర్వాత బాపయ్య గారి డైరెక్షన్ లో అగ్గి రవ్వ చేసాను. అందులో నేను హీరోయిన్ ని... ఎన్టీఆర్‌ గారు హీరోగా డ్యుయల్ రోల్ చేసారు.. ఆ తర్వాత చండశాసనుడు సినిమాలో గెస్ట్ రోల్ గా చేసాను" అని చెప్పుకొచ్చింది కవిత. ఇలా తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం గురించి ఆమె తెలుగు వన్ తో షేర్ చేసుకుంది.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.