English | Telugu

బాల‌య్యని పేర‌డీ చేసిన సంపూ

నీకు బీపీ వ‌స్తే నీ పీకే వ‌ణుకుతాడేమో
నాకు బీపీ వ‌స్తే ఏపీ వ‌ణుకుద్దీ..
- ఇదీ లెజెండ్‌లో బాల‌య్య డైలాగ్‌.
దీన్ని సంపూ పేర‌డీ చేశాడు... సింగం 123 కోసం
నీకు బీపీ వ‌స్తే నీ చంచాగాళ్లు భ‌య‌ప‌డ‌తారేమో
నాకు బీపీ వ‌స్తే... ఏపీ తెలంగాణ రాయ‌ల‌సీమ కేర‌ళ బీహార్ క‌ర్నాట‌క‌... దేశం మొత్తం వ‌ణుకొద్ది.. అంటూ ఆల్ ఇండియాకి వినిపించేలా గ‌ర్జించాడు సంపూ. ఆఖ‌రికి రేసుగుర్రంలో బ‌న్నీ డైలాగ్‌నీ వ‌ద‌ల్లేదు. రేసులో ఉన్న‌వాళ్ల‌ని అందుకోవ‌డానికి నేను రేసుగుర్రాన్ని కాదు... రెడ్ బుల్ తాగిన సింహాన్ని.. అంటూ మ‌ళ్లీ వీర ప్ర‌తాపం చూపించాడు. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ఈ ట్రైట‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వీలుంటే మీరూ ఓ లుక్కేయండి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.