English | Telugu

'ఆహా'లో 'సమ్మతమే'

కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా 'సమ్మతమే'. గోపినాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ జూన్ 24న విడుదలై పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా మూడు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

"మనకు నచ్చిన వ్యక్తిని లైఫ్ పార్టనర్ చేసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ వ్యక్తి లైఫ్ ని మనం కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు" అనే పాయింట్ తో 'సమ్మతమే' తెరకెక్కింది. మన జీవితంలోకి వచ్చే అమ్మాయి ఇష్టాలను మనం గౌరవించాలి అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు దర్శకుడు. ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ నెల 15 నుంచి సమ్మతమే స్ట్రీమింగ్ కానుంది.

యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కనకాల ప్రవీణ నిర్మించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఈ సినిమాకి సినిమాటోగ్ర‌ఫర్ గా సతీష్ రెడ్డి మాసం, ఎడిటర్ గా విప్లవ్ నైషధం వ్యవహరించారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.