English | Telugu

సాయి పల్లవికి విశ్రాంతి అవసరం 

సినీప్రేక్షకుల్లో హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ని సంపాదించిన నటి సాయిపల్లవి(Sai Pallavi).అభిమానుల నుంచి లేడీ పవర్ స్టార్ అనే బిరుదుని కూడా పొందిందంటే సాయిపల్లవి యాక్టింగ్ కి ఉన్న స్టామినాని అర్ధం చేసుకోవచ్చు.మూవీ ఏదైనా సరే తన మార్క్ మాత్రం స్పషంగా ఉంటుంది.ఇందుకు ఆమె నటించిన గత చిత్రాలే ఉదాహరణ.ఇప్పుడు ఫిబ్రవరి 7 న యువసామ్రాట్ 'నాగ చైతన్య' తో కలిసి పాన్ ఇండియా మూవీ 'తండేల్' తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో 'తండేల్'(Thandel)యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.కానీ సాయి పల్లవి మాత్రం కనిపించటం లేదు.దీంతో ఆమె అభిమానుల్లో సాయి పల్లవి ఎందుకు కనిపించడం లేదనే చర్చ జరుగుతుంది.ఇప్పుడు ఈ విషయంపై నిన్న ముంబై లో జరిగిన ఈవెంట్ లో తండేల్ చిత్ర దర్శకుడు చందు మొండేటి(Chandu Mondeti)మాట్లాడుతు సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం,జలుబు తో బాధపడుతున్నారు.దీంతో ఆమెకి కనీసం రెండు రోజుల పాటు అయిన రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారు.అందుకే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చాడు.

సాయిపల్లవి తండేల్ రిలీజ్ కి సంబంధించి చెన్నై వేదికగా జరిగిన ప్రమోషన్స్ లో పాల్గొంది.ఈ సందర్భంగా సాయిపల్లవి ని ఉద్హేశించి చిత్ర నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind)మాట్లాడుతు ఒంట్లో బాగోలేదు కదా వెళ్లిపొమ్మని కూడా చెప్పాడు.ఇక 'తండేల్' చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఇండస్ట్రీ వర్గాలతో పాటు అక్కినేని అభిమానులు,ప్రేక్షకుల్లో మూవీపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.