English | Telugu

రోజా, ఆత్యా పాత్య.. అరెస్ట్ తప్పదా!

సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన నటి రోజా(roja)ఎంఎల్ఏ గా, మంత్రి గా గత వైసిపీ ప్రభుత్వంలో బాధ్యతలుకూడా చేపట్టింది. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో చిత్తుగా ఒడి ప్రస్తుతం రకరకాల ప్రాంతాల్లో తిరుగుతు ఉంది. తాజాగా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రోజా గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంని నిర్వహించింది.వాటి నిర్వహణకి 125 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు ఈ విషయమే రోజా మెడకు చుట్టుకుంది. శాంక్షన్ అయిన
125 కోట్ల రూపాయల్లో 105 కోట్లు దుర్వినియాగం అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై ఆత్యా పాత్య సిఈ ఓ ప్రసాద్ సిఐడి కి ఫిర్యాదు చేసాడు. దీంతో సిఐడి విచారణకి ఆదేశించింది. విజయవాడ సిపీ కి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

దీంతో ఇప్పుడు రోజా అరెస్ట్ ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా కోట్ల ఆస్తులని సంపాదించిందనే ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వంలో చట్ట ప్రకారమే చర్యలు ఉండబోతున్నాయని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. రోజా గతంలో చంద్ర బాబు నాయుడు(chandrababu naidu) పవన్(pawan kalyan)ని నోటికి ఏది వస్తే అది మాట్లాడి తన అభిమానులని కూడా దూరం చేసుకున్న విషయం అందరకి తెలిసిన విషయమే.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.