English | Telugu

నాయుడుగారి కుటుంబం నుంచి మూడో హీరో!


కాస్త సినిమా పరిజ్ఙానం ఉన్న ఎవరికైనా సరే... నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ గురించి తెలవకుండా ఉండదు. సురేశ్ ప్రొడక్షన్ కి సంబంధించిన కార్యక్రమాల్లో అభిరామ్ చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. అంతేకాదు.. ‘కాంట్రవర్సీ పర్సన్’ అనే పేరు కూడా అభిరామ్ కి ఉంది. గతంలో జరిగిన కొన్ని పరిణామాలు అతనికి ఆ పేరు తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ... నిజానికి అభిరామ్ వ్యక్తిత్వం ఎలాంటిదో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆ కుర్రాడి టాపిక్ దేనికి? అంటారా? విషయం ఏంటంటే.. త్వరలోనే అభిరామ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తన తండ్రి సురేశ్ బాబే ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం.

దర్శకుడు భానుశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అతను చెప్పిన కథ.. సురేశ్ కీ, అభిరామ్ కి కూడా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ముంబాయ్ భామ మాళవిక శర్మను కథానాయికగా ఫిక్స్ చేయడం కూడా జరిగిపోయింది. అభిరామ్ హీరోగా లాంచ్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని... త్వరలోనే రామానాయుడు స్టూడియోలో ఓ భారీ వేడుకను నిర్వహించనున్నాడట నిర్మాత సురేశ్ బాబు. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరూ హాజరవ్వనున్నారని టాక్. ఇప్పటికే రామానాయుడు ఫ్యామిలీ నుంచి వెంకటేశ్, రానా హీరోలు పరిచయమై మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడో హీరో రాబోతున్నాడన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్ అభిరామ్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.