English | Telugu

ఢిల్లీ భామకి ఫుల్ డిమాండ్

'రకుల్ ప్రీత్ సింగ్' ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకొ౦టుంది. గోపీచంద్ సరసన 'లౌక్యం', రామ్ సరసన 'పండుగ చేస్కో', మంచు మనోజ్ సరసన 'కరెంట్ తీగ', ఆది సరసన 'రఫ్' చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో భారీ ఆఫర్ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. మాస్ మహరాజా రవితేజ సరసన నటించే అవకాశం రకుల్ కి దక్కిందని తెలుస్తోంది. రవితేజ తో నటిస్తుండడంతో ఈ సారి రకుల్ టాలీవుడ్ పెద్ద హీరోల దృష్టిలో పడుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ ఆఫర్ ను తలచుకుని ఈ బ్యూటీ తెగమురిసిపోతుందట.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.