English | Telugu

సూపర్ స్టార్ రజనీ కాంత్ కి స్వల్ప అస్వస్థత

సూపర్ స్టార్ రజనీ కాంత్ కి స్వల్ప అస్వస్థత కలిగింది. వివరాల్లోకి వెళితే సౌతిండియన్ సినిమా స్టామినాని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళిన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "రాణా" కోసం ఎ.వి.యమ్ స్టుడియోకి వెళ్ళారు. ఆ సినిమా ప్రారంభోత్సవం కాగానే ఆయనకు కడుపునొప్పి రావటంతో ఆయన్ని వేంటనే చెన్నై మైలాపూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఆయనకు ఒక సిలైన్ ఎక్కించి, రక్తపోటు వంటి కొన్ని రొటీన్ పరీక్షలు చేశారు. అనంతరం రజనీకాంత్ ఆరోగ్యానికి ఏం భయం లేదనీ, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, కాకపోతే ఆయన్ని కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవలసిందిగా డాక్టర్లు సూచనలిచ్చారు.

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న"రాణా" చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకులుగా, ఎఅ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ "రాణా" చిత్రంలో రజనీ కాంత్ త్రిపాత్రాభినయం చేస్తూండగా దీపిక పదుకునే, ఇలియానా, విద్యాబాలన్ లు వంటి ప్రముఖ నటీమణులు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.