English | Telugu

తెలుగునాట రజినీకాంత్ సంచలనం!

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకి తమిళ హీరో కానీ, ఆయనకు అన్ని చోట్లా అభిమానులున్నారు. రజినీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. ఓ సెలబ్రేషన్ అన్నట్టుగా ఉంటుంది. తెలుగునాట కూడా ఆయనకు ఎందరో అభిమానులున్నారు. రజినీకాంత్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తున్న వసూళ్ళను దానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

తెలుగునాట ఇప్పటిదాకా ఆరు తమిళ సినిమాలు రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరగా.. అందులో నాలుగు సినిమాలు రజినీకాంత్ వే కావడం విశేషం. మొదటిసారి 2010లో వచ్చిన 'రోబో'తో ఈ ఫీట్ సాధించారు రజినీ. '2.O', 'జైలర్' చిత్రాలతో మరో రెండుసార్లు 50 కోట్ల క్లబ్ లో చేరారు. ఇక ఇప్పుడు 'కూలీ'తో నాలుగోసారి ఈ ఫీట్ సాధించారు. రజినీకాంత్ సినిమాలు కాకుండా 'ఐ','అమరన్' మాత్రమే ఇప్పటిదాకా ఈ ఘనత సాధించాయి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ' సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. పోటీగా 'వార్-2' ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.