English | Telugu

నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా 

తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై లెజండ్రీ యాక్టర్స్ నటకిరీటి 'రాజేంద్రప్రసాద్'(Rajendraprasad),కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam)కి ఉన్న చరిష్మా తెలిసిందే. ఏ క్యారక్టర్ లోకైనా పరకాయప్రవేశం చేసి సదరు క్యారెక్టర్స్ ని అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో సజీవ రూపంగా నిలిచేలా చెయ్యడంలో ఆ ఇద్దరు స్పెషలిస్ట్స్. అందుకే మోస్ట్ వాంటెడ్ నటులుగా మారారు. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఇద్దరి కాంబో కి మంచి క్రేజ్ ఉంది.

ప్రస్తుతం ఈ ఇద్దరు 'స:కుటుంబానాం' అనే కొత్త చిత్రంలో కలిసి చేస్తున్నారు. రీసెంట్ గా ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇద్దరు హాజరయ్యారు. సదరు ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం అని రాజేంద్ర ప్రసాద్ అనగానే బ్రహ్మనందం అందుకొని ఎంత మాట్లాడినా మీ శిష్యులమే కదా అని అన్నాడు. ఆ తర్వాత బ్రహ్మ్మనందం ని ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతు ఎంతైనా నువ్వు ముసలి ముండా కొడుకువి కదా అని అన్నాడు. వెంటనే మళ్ళీ బ్రహ్మానందం అందుకొని ఎవరు అనగానే నేను అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ప్రస్తుతం ఈ మాటల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇక స:కుటుంబానాం(Sahakutumbaanaam)చిత్రం డిసెంబర్ 12 న రిలీజ్ కి సిద్ధమవుతుండగా రామ్ కిరణ్, గిరిధర్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్ లుగా కనిపిస్తున్నారు. ఉదయ్ శర్మ(Uday sharma)దర్శకుడు కాగా హెచ్ ఎన్ జి సినిమాస్ నిర్మిస్తుంది.



Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.