English | Telugu

గెలుపు రాజేంద్ర‌ప్ర‌సాద్‌దేనా??

'మా' ఎన్నిక‌ల‌కు సంబంధిచిన కీల‌క తీర్పును న్యాయ‌స్థానం రేపు (మంగ‌ళ‌వారం) వెలువ‌రించ‌నుంది. 'మా' అధ్య‌క్ష్య పీఠం కోసం అటు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఇటు జ‌య‌సుధ హోరా హోరీగా త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌లు ముగిసినా కౌంటింగ్ ఆపాల‌ని న్యాయ‌స్థానం తీర్పు చెప్పింది. 7వ తేదీన కౌంటింగ్‌కి సంబ‌ధించిన అనుమ‌తి న్యాయ స్థానం జారీ చేసే అవ‌కాశం ఉంది. ఒక‌ట్రెండు రోజుల్లో కౌంటిగ్ కూడా ముగియ‌నుంది. ఈలోగా `మా` పీఠం అధిష్టించేవాళ్లు ఎవ‌రు అనే విష‌యంపై ఆస‌క్తి నెల‌కొంది. ఎన్నిక‌ల ముందు జ‌య‌సుధ‌దే ఈ స్థానం అని ధీమాగా చెప్పిన‌వాళ్లు కూడా.. ఇప్పుడు ఆమె గెలుపుపై సందేహాలు వ్య‌క్త‌ప‌రుస్తున్నార‌ట‌. రాజేంద్ర ప్ర‌సాద్ గ‌ట్టి పోటీ ఇచ్చార‌ని, ఆయ‌న‌పై సానుభూతి ప‌వ‌న‌నాలు వీచాయ‌ని, ఈసారి ఆయ‌న గెలిచినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప‌రిశ్రమ నుంచి న‌ట‌కిరీటికి ఎలాంటి స‌పోర్ట్ ల‌భించ‌లేదు. దానికి తోడు జ‌య‌సుధ‌కు దాస‌రి వ‌ర్గం అండ ఉంది. అందుకే ఈసారీ రాజేంద్ర ప్ర‌సాద్ ఓట‌మి త‌ప్ప‌దనుకొన్నారంతా. గ‌తంలో అతి త‌క్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన న‌ట‌కిరీటికి ఈసారి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని చెప్పుకొన్నారు. అయితే.. ఎన్నిక‌ల స‌ర‌ళి చూశాక‌.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌కీ గెలిచే అవ‌కాశాలున్నాయ‌ని, ఆ మాట‌కొస్తే ఈసారి గెలుపు ఆయ‌న‌దే అని కొంత‌మంది బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. చివ‌రి క్ష‌ణాల్లో అల్ల‌రి న‌రేష్‌.. న‌ట‌కిరీటి కోసం గ‌ట్టిగా ప‌నిచేశాడ‌ట‌. న‌రేష్‌కి యూత్ హీరోల‌తో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ స్నేహం కొద్దీ.. న‌రేష్ చెప్పిన‌ట్టు రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి ఓట్లు గుద్దేశార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. రెండు ద‌ఫాలుగా మా అధ్య‌క్షుడిగా ఉన్న ముర‌ళీమోహ‌న్ ఏం చేయ‌లేదని, ఆయ‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త జ‌య‌సుధ‌పై ప‌డింద‌ని చెప్పుకొంటున్నారు. ఇంకెంత‌.. రెండు మూడు రోజులు ఆగితే ఈ స‌స్పెన్స్‌కి తెర ప‌డ‌డం ఖాయం. గెలుపు ఎవ‌రితో తెలియాలంటే.. ఇంకొన్ని గంట‌లు ఆగితే స‌రిపోతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.