English | Telugu

అఖిల్‌కి నాన్న దొరికాడు

ఈ మ‌ధ్య తెలుగు తెర‌పై నాన్న పాత్ర‌ల‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. యువ క‌థానాయ‌కులే కాదు, సీరియ‌ర్ హీరోల సినిమాల్లోనూ నాన్న పాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు ద‌ర్శ‌కులు. దాంతో హీరో, హీరోయిన్ల‌కు స‌రిపోయే నాన్న‌ల‌ను వెదికిప‌ట్టుకోవ‌డం ద‌ర్శ‌కులకు కాసింత క‌ష్టంగా మారింది. ఈ పాత్ర‌కు ఇది వ‌ర‌కు నాన్న అన‌గానే ప్ర‌కాష్‌రాజ్ గుర్తొచ్చేవారు. ఇప్పుడు స‌రికొత్త ప్రత్యామ్న‌యాలు దొరికేస్తున్నాయి. జ‌గ‌ప‌తిబాబు ప్ర‌కాష్‌రాజ్ కి గ‌ట్టి పోటీ ఇస్తే.. ఇప్పుడు రాజేంద్ర ప్ర‌సాద్ కూడా రెఢీ అంటున్నాడు. 'శ్రీ‌మంతుడు'లో మ‌హేష్‌బాబుకి నాన్న‌గా న‌టిస్తున్నారు న‌ట‌కిరీటి. ఇప్పుడు.. అఖిల్‌కీ ఆయ‌నే నాన్న‌. అఖిల్ - వినాయ‌క్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో అఖిల్‌కి నాన్నగా రాజేంద్ర ప్ర‌సాద్‌ని ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ టీమ్‌తో రాజేంద్ర ప్ర‌సాద్ కూడా జాయిన్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.