English | Telugu

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్న రాజమౌళి ట్వీట్!

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడిగా రాజమౌళిని అందరూ గౌరవిస్తారు. అంతేకాదు, తమ హీరోతో రాజమౌళి ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో హీరోల అభిమానులు కోరుకుంటారు. ఈ జనరేషన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తో సినిమాలు చేశారు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతోనూ ఓ మూవీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం ఇంతవరకు చేయలేదు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాల తర్వాత ఆయన నటనకు దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ యాక్టింగ్ కెరీర్ ని కంటిన్యూ చేసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక సినిమా కోసం రెండు మూడేళ్లు కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. దాంతో పవన్-రాజమౌళి కాంబినేషన్ అనేది తెరపై చూడటం దాదాపు అసాధ్యమే.

అయితే పవన్ కళ్యాణ్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం. గతంలో పలు సందర్భాల్లో ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే చెప్పారు. అంతేకాదు, పవన్ తో సినిమా చేయడానికి అప్పట్లో ఆయన ప్రయత్నించారు. అలాంటి రాజమౌళి.. పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించారు. అది కూడా ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం రాజమౌళి చేసిన ఓ ట్వీట్ చూసి.. పవన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

2010లో రాజమౌళిని ఉద్దేశించి ఓ పవన్ అభిమాని సంచలన ట్వీట్ చేశాడు. "పవన్ మీతో మూవీ చేయడు. పవన్ మూవీస్, మీ మూవీస్ పూర్తి ఆపోజిట్. పవన్ మూవీస్ లో డబుల్ మీనింగ్స్, హీరోయిన్ ఎక్స్ పోజింగ్, వయలెన్స్ ఉండవు." అని అభిమాని ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ కి వెంటనే రాజమౌళి కౌంటర్ ఇచ్చారు. "నువ్వు చెప్పింది నిజమే కావచ్చు బ్రదర్. ఇంతకీ నువ్వు బంగారం సినిమాలో సుబ్బులు సాంగ్ విన్నావా? అదేమైనా భక్తి గీతమా?" అంటూ రాజమౌళి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

15 ఏళ్ళ క్రితం నాటి ఈ ట్వీట్ ఉన్నట్టుండి ఇప్పుడు వైరల్ గా మారింది. యాంటి ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని రీట్వీట్ చేస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఆ ట్వీట్ లో తప్పేముందని అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో మెజారిటీ కమర్షియల్ సినిమాల్లో ఆ ఎలిమెంట్స్ ఉండేవని.. అదే విషయాన్ని రాజమౌళి కాస్త వెటకారంగా చెప్పే ప్రయత్నం చేశారు తప్ప అందులో తప్పేంలేదని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం నాటి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకే సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా పోస్ట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.