English | Telugu

రామ్ చరణ్, సంపత్ నందిల రచ్చ జూన్ 1 నుంచి

రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" జూన్ 1 నుంచి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో రాం చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" చిత్రం ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.

రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" కోసం హీరో రామ్ చరణ్ అమెరికాలోని మియామీలో అంతర్జాతీయ జిమ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" ఒక విభిన్నమైన మాస్ ఓరియెంటెడ్ కథనీ, ఇందులో అంతర్లీనంగా ఒక అందమైన ప్రేమ కథ కూడా జొప్పించారనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. తన తొలి చిత్రం "ఏమైంది ఈ వేళ" తోనే యువతను ఆకట్టుకున్న యువదర్శకుడు సంపత్ నంది ఈ "రచ్చ" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోని కలెక్షన్ల రికార్డులను రచ్చ రచ్చ చేయనున్నాడని సినీ వర్గాలంటున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.