English | Telugu

చౌద‌రికి చుర‌కేసేశాడు!

ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి ద‌గ్గ‌ర కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆయ‌న అస‌లే రెబ‌ల్‌స్టార్‌. మ‌నిషిని ఎదురుగా పెట్టుకొని వాళ్ల‌పై సెట‌ర్లు వేయ‌డానికి కూడా సిద్ధ‌ప‌డ‌తారు. అలాంటి సెటైరే వైవిఎస్ చౌద‌రిపైనా ప‌డిపోయింది. రేయ్ ప్ర‌మోష‌న్ల‌లో ఆర్‌. నారాయణ మూర్తి కూడా క‌నిపిస్తున్నాడు. చౌద‌రికి నారాయ‌ణ‌మూర్తి అంటే అభిమానం ఎక్కువ‌. అందుకే.. రేయ్ ప్రెస్‌మీట్ల‌లో నారాయ‌ణ మూర్తి హాజ‌రు కూడా త‌ప్ప‌ని స‌రి. ఈమ‌ధ్యే రేయ్ స‌క్సెస్‌మీట్ జ‌రిగింది. స‌భ‌లో.. నారాయ‌ణ‌మూర్తి ఆవేశంగా మాట్లాడాడు. వైవిఎస్ చౌద‌రి కృషి, ప‌ట్టుద‌ల మెచ్చుకొన్నాడు. అయితే.. చివ‌ర్లో కొస‌మెరుపుగా ఓ చుర‌కా వేశాడు. ''బ్ర‌ద‌రూ... నీ సినిమాలో బూతులున్నాయి.కాస్త త‌గ్గించుకో..'' అన్నాడు. దాంతో వైవిఎస్ చౌద‌రికి షాక్ త‌గిలింది. ఆ ప‌క్క‌నే ఈ చిత్రానికి మాట‌లు రాసిన శ్రీ‌ధ‌ర్ సిపాన కూడా ఉన్నాడు. రెడ్ స్టార్ మాట‌లు ఆయ‌న‌కూ బాగా త‌గిలాయి..! మొత్తానికి స‌క్సెస్ మీట్‌కి వెళ్లి.. వాళ్ల గాలి తీసొచ్చాడు నారాయ‌ణ మూర్తి. వెరైటీ అంటే ఇదే క‌దా..?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.