English | Telugu

తమిళనాట పుష్పరాజ్ వినాయకచవితి.. హిందూ సంఘాల ఆగ్రహం 

'స్టైలిష్ స్టార్' గా ఉన్న అల్లు అర్జున్(Allu Arjun)'పుష్ప పార్ట్ 1'తో పాన్ ఇండియా వ్యాప్తంగా సత్తా చాటి 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ గా ఎస్టాబ్లిష్ అయిన విషయం తెలిసిందే. పార్ట్ 1 తో వచ్చిన ట్రెండ్ ని కంటిన్యూ చేస్తు 'తగ్గేదెలే' అంటు 'పుష్ప పార్ట్ 2'(Pushpa 2)తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ రెండు భాగాల ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించడమే కాకుండా, పుష్ప క్యారక్టర్ ని అభిమానులు ఓన్ చేసుకునేలా అల్లు అర్జున్ నటన కొనసాగింది. అందుకు నిదర్శనంగా నిలిచిన ఒక సంఘటన తమిళనాడు(Thamilandu)లో జరిగింది.

నిన్నప్రారంభమైన 'వినాయక చవితి' వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు 'గజముఖుడ్ని' పలు రూపాల్లో రూపొందించుకొని, భక్తితో ప్రార్దిస్తు తన్మయత్వం చెందటం పరిపాటి. తమ శక్తి కొలది భారీ స్థాయిలో మండపాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ కోవలోనే తమిళనాడులోని 'హొసూరు' కి చెందిన అల్లు అర్జున్ అభిమానులు వినాయక చవితి వేడుకల సందర్భంగా 'పుష్ప 2 'లో క్లైమాక్స్ ఫైట్ జరిగిన బిల్డింగ్ సెట్ లా ఉండేలా, ఎర్ర చందనం దుంగలు పోలిన వాటితో భారీ మండపాన్ని ఏర్పాటు చేసారు.మండపం బయట అల్లు అర్జున్ వాడిన హెలికాఫ్టర్, భుజంపై గన్ తో ఉన్న పుష్పరాజ్ ఉండగా, లోపల అమ్మవారి గెటప్ లో త్రిశూలం ధరించిన పుష్పరాజ్ కి వినాయకుడిగా ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తున్నారు.

ముప్పై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్ కి సంబందించిన వీడియోని అల్లు అర్జున్ స్నేహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu)సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు. ఇక దేవుడి రూపానికి పుష్ప రాజ్ లాంటి ఒక స్మగ్లర్ ఆకారంలో రూపొందించడం పట్ల పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలోను తెలుగు నాట 'బాహుబలి' వినాయకుడు, పుష్ప వినాయకుడిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.