English | Telugu

అనుమానాస్పద స్థితిలో నిర్మాత కుటుంబం మృతి


మలయాళ సినీ నిర్మాత సంతోష్ కుమార్ కుటుంబ సమేతంగా అనుమానాస్పద స్థితిలో మరణించారు. సంతోష్ కుమార్ ఆయన భార్య, కుమార్తెతో కలిసి ఐదేళ్లుగా దుబాయ్ లో నివాసముంటున్నారు. పోయిన గురువారం నుంచి సంతోష్ కుటుంబానికి సంబంధించిన ఎవరూ ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో సమీప బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంతోష్ నివాసముంటున్న ఫ్లాట్ తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి.కుళ్లిపోయి కనిపించిన వీరి మృతదేహాలపై అనేక కత్తిపోట్లు కనిపిస్తుండగా, దీనిని అక్కడి పోలీసులు మాత్రం ఆత్మహత్యలుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుల బాధ తాళలేక సంతోష్ కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు.


సంతోష్ కుమార్ కేరళలో సౌపర్ణిక ఫిలింస్ నిర్మాణ సంస్థ తో పాటు దుబాయ్ లో ఇతర వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 'మడాంబి' సినిమాకు ఆయన కోప్రొడ్యూసర్. అలాగే మరిన్ని రీమేక్ చిత్రాలు కూడా ఆయన నిర్మించారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.