English | Telugu

మాట నిలబెట్టుకున్న SKN.. డిప్యూటీ సీఎం గారి తాలూకానా మజాకా!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్‌కెఎన్ (SKN) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మరియమ్మ కుటుంబానికి ఆటో కొనిచ్చారు. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలిస్తే.. నా భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తాను అని ఎన్నికల సమయంలో మరియమ్మ చెప్పారు. ఆ వీడియో వైరల్ గా మారి ఎస్‌కెఎన్ వరకు చేరింది. "కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, ఆమె భర్త కోసం నేను ఆటో బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను" అని ఆ టైంలో ఎస్‌కెఎన్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు .

ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో.. తమ మాటను నిలబెట్టుకున్నారు ఎస్‌కెఎన్. "మరియమ్మ గారి కుటుంబానికి ఆటోను బహుమతిగా ఇచ్చాను. వారి మనవడు దానిని నడిపి వారి కుటుంబాన్ని చూసుకుంటాడు. వారి కళ్ళలో ఆనందం చూసి చాలా సంతోషంగా ఉంది." అంటూ ఎస్‌కెఎన్ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.