English | Telugu

పవన్ సారూ.. ఈ న్యూస్‌ నిజమేనా..?

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రానికి ప్రమోషన్ ఏ రేంజ్‌లో చేశారో ప్రపంచం కళ్లు అప్పగించి చూసింది. కార్స్, సిమ్స్, వెండి నాణేలు ఇలా ఒకటేంటి ఎలా కుదిరితే అలా బ్రాండింగ్ చేశారు. చివరకు కార్పోరేట్ దిగ్గజాలు కూడా కబాలి క్రేజ్‌ను క్యాష్ చేసుకుని వారి అమ్మకాలను పెంచుకునేందుకు ఎగబడ్డాయి. ఈ ప్రమోషన్ కారణంగానే సినిమా ఫ్లాపైనా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది కబాలి. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. ఆయన దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి పబ్లిసిటీ కబాలి స్థాయిలో జరుగుతుందని టాలీవుడ్ టాక్.

ఫిలింనగర్ వర్గాల సమచారం ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రెండు విమానాలను అజ్ఞాతవాసి ఫోటోలతో బ్రాండింగ్ చేయనున్నారట. అలాగే రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైన మెట్రోను కూడా ఇందుకు ఉపయోగించనున్నారట. ఆడియో ఈవెంట్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించేందుకు అనేక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు పోటీ పడుతుండటంతో.. ఈ ఫంక్షన్‌కు ఎవరు ఎలాంటి ఆఫర్లు ఇస్తారో తెలుపుతూ టెండర్లు వేయమని నిర్మాతలు కోరుతున్నారట. ఇప్పటికే సినిమా కోసం ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల్లో ఈ బ్రాండింగ్ న్యూస్ జోష్ తీసుకువచ్చిందట. అయితే ఈ వార్తలు కేవలం పుకార్లా లేకపోతే నిజంగానే ఆ రేంజ్‌లో ప్రమోషన్లు ప్లాన్ చేశారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.