English | Telugu

Patang Review: పతంగ్ మూవీ రివ్యూ

తారాగణం: ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్, అను హాసన్ తదితరులు
సంగీతం: జోస్ జిమ్మీ
డీఓపీ: శక్తి అరవింద్
ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పు
రచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి
నిర్మాణం: నాని బండ్రెడ్డి ప్రొడక్షన్
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన సినిమాలలో 'పతంగ్' ఒకటి. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..? (Patang Movie Review)

కథ:
హైదరాబాద్ లోని బస్తీ కుర్రాడు విస్కీ అలియాస్ వంశీ కృష్ణ (వంశీ పూజిత్), సంపన్న కుటుంబానికి చెందిన అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్. ఏ విషయంలోనూ క్లారిటీగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఐశ్వర్య, మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్ ని కూడా ఇష్టపడుతుంది. ఐశ్వర్య రాకతో విస్కీ, అరుణ్ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల ప్రాణ స్నేహితుల మధ్య విభేదాలు వచ్చాయా? చివరికి ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
తెలుగు ప్రేక్షకులకు ముక్కోణపు ప్రేమ కథలు కొత్త కాదు. ఈ తరహా కథలు ఇప్పటికే ఎన్నో చూశాము. అయితే ఎక్కువగా.. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం చూస్తుంటాం. కానీ, ఇందులో అమ్మాయే తన కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్ కారణంగా ఒకేసారి ఇద్దరు అబ్బాయిలను ఇష్టపడుతుంది. అదే ఇందులో ఆసక్తికర పాయింట్.

పతంగ్ కథ చాలా చిన్నది. అయినప్పటికీ దర్శకుడు తనదైన కథనంతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. సహజమైన సన్నివేశాలతో, సున్నితమైన హాస్యంతో సినిమాని నడిపించిన తీరు అభినందనీయం. ఫస్ట్ హాఫ్ మనకు తెలియకుండానే సరదాగా నడిచిపోతుంది. విస్కీ-అరుణ్ ఫ్రెండ్ షిప్, విస్కీ-ఐశ్వర్య ప్రేమ కథ, అరుణ్ ని కూడా ఐశ్వర్య ఇష్టపడటం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ నవ్వులను పంచుతుంది.

రెండు వస్తువులు ఎదురుగా ఉంటేనే ఏది సెలెక్ట్ చేసుకోవాలని కన్‌ఫ్యూజ్ అయ్యే అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలలో జీవిత భాగస్వామిగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ.. కథ సెకండ్ హాఫ్ లోకి అడుగుపెడుతుంది. సెకండ్ హాఫ్ ప్రధానంగా పతంగ్ పోటీ చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి. అయితే మెయిన్ పతంగ్ పోటీ మాత్రం మెప్పించింది. ముఖ్యంగా విష్ణు ఓఐ కామెంటరీ ఆ ఎపిసోడ్ కి బలంగా నిలిచింది. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి.

యూత్ ఫుల్ సినిమాలంటే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్ లతో నిండిపోయి.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి ఇబ్బందిపడేలా ఉంటాయి. పతంగ్ మూవీ టీమ్ ఆ తప్పు చేయలేదు. కుటుంబంతో కలిసి చూసేలా ఈ సినిమాని మలిచారు. ఈ సినిమాకి మెయిన్ మైనస్ ఏదైనా ఉందంటే.. నిడివి ఎక్కువ ఉండటమే. కనీసం 10-15 నిమిషాలు ట్రిమ్ చేసినట్లయితే.. మూవీ క్రిస్పీగా, మరింత మెరుగ్గా ఉండేది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నటీనటులు కొత్తవారే అయినప్పటికీ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. కన్‌ఫ్యూజింగ్ మైండ్ సెట్ ఉన్న ఐశ్వర్య పాత్రలో ప్రీతి పగడాల మెప్పించింది. బస్తీ కుర్రాడిగా వంశీ పూజిత్, రిచ్ కిడ్ గా ప్రణవ్ కౌశిక్ చక్కగా రాణించారు. విష్ణు ఓఐ ఉన్నంతసేపు బాగానే నవ్వించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్, అను హాసన్ తదితరులు పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతికంగానూ పతంగ్ మెప్పించింది. జోస్ జిమ్మీ సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పాటలు, నేపథ్య సంగీతంతో మ్యాజిక్ చేశాడు. శక్తి అరవింద్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. చాణక్య రెడ్డి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయొచ్చు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా..
తెలిసిన కథే అయినప్పటికీ.. ఫ్యామిలీతో కలిసి చూసి, కాసేపు సరదాగా నవ్వుకునేలా ఉంది ఈ 'పతంగ్'.

రేటింగ్: 2.75/5

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.