English | Telugu

కలెక్షన్స్ లో మా వాటా మాకు ఇచ్చేయాలి.. పాకిస్థాన్ ప్రజల డిమాండ్


-మా వాటా ఎంతో తెలుసా!
-పాకిస్థాన్ ఏమంటుంది
-ఎంత వచ్చాయి
-లయరీ ని బాగానే వాడారు


ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 'ధురంధర్'(Dhurandhar)ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి ప్రీ ప్రిపరేషన్ లో ఉంది. వెయ్యి కోట్ల రూపాయిల కలెక్షన్స్ కి చేరువ కాబోతుండటమే అందుకు ఉదాహరణ. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా 'దురంధర్' పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. అంతలా ధురంధర్ భారీ విజయం వైపు దూసుకెళ్తుంది. ఇందుకు ప్రధాన కారణం నటీనటుల పెర్ఫార్మెన్సుతో పాటు చిత్ర కథ. ముఖ్యంగా పాకిస్థాన్(Pakisthan)లోని కరాచీ(Karachi)లో ఉన్న 'లయరీ'(Lyari)ప్రాంతం కూడా విజయంలో కీలక పాత్ర పోషించింది.


ఇప్పుడు ఆ లయరీ ప్రాంత ప్రజలు పలు డిమాండ్స్ ని ధురంధర్ మేకర్స్ ముందు ఉంచుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాళ్ళు మాట్లాడుతు 'ధురంధర్ కథ మా ప్రాంతంలో జరిగే కథగా చిత్రీకరించారు కాబట్టి కలెక్షన్స్ లో వాటా ఇవ్వాలి. సదరు వాటా ఎనభై శాతం ఉండాలి. అసలు సగం వాటా ఇవ్వాలి. మేకర్స్ మా ఏరియాలో హాస్పిటల్ కట్టించి ఇవ్వాలి. ఒక వేళ మేకర్స్ ఇవ్వాలనుకున్నా మాకు ఒక రూపాయికి కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఇలా లయరీ కి చెందిన పలువురు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి.


Also read: సిఐడి ఆఫీస్ లో మంచు లక్ష్మి.. రీజన్ ఇదే


లయరీ టౌన్ విషయానికి వస్తే ఒకప్పుడు కరుడుగట్టిన రౌడీయిజానికి పెట్టింది పేరు. రెహ్మాన్ డెకాయిట్ ఒక అసాంఘిక శక్తీ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాడు. ఇండియాలోజరిగే ఉగ్రవాదుల దాడులకి కూడా సాయం చేస్తుంటాడు. దీంతో మన ఇండియన్ రా ఆఫీసర్ మారుపేరుతో డెకాయిట్ దగ్గర పనిలో చేరి కుడి భుజంగ మారతాడు. ఆ తర్వాత అక్కడి లోకల్ పోలీస్ అధికారి, పొలిటికల్ లీడర్ తో కలిసి డెకాయిట్ ని అంతమొందిస్తాడు.దీంతో కథ జరిగే కాలాన్ని బట్టి, క్యారక్టర్ ల మైండ్ సెట్ ని బట్టి లయరీ టౌన్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి టౌన్ ని మేకర్స్ పర్ఫెక్ట్ గా సెట్ తో తీర్చిద్ది అక్కడే కథ జరుగుతున్నట్టుగా మెస్మరైజ్ చేయడం జరిగింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.