English | Telugu

గుండు గుత్తగా లేపేద్దాం బాంచన్.. నాని ఊర మాస్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా'. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాని పూర్తిస్థాయి మాస్ లుక్ లో కనిపిస్తుండటంతో దసరాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

దసరా మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. "వీర్లపల్లి.. చుట్టూరా బొగ్గు కుప్పలు.. తొంగి చూస్తే గానీ కనిపియ్యని ఊరు. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటుపడిన సంప్రదాయం" అంటూ నాని వాయిస్ తో టీజర్ మొదలైంది. విజువల్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. నాని గెటప్, బాడీ ల్యాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. బొగ్గుగనుల నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. "నీయవ్వ ఎట్లయితే గట్లాయె.. గుండు గుత్తగా లేపేద్దాం బాంచన్" అంటూ తెలంగాణ యాసలో డైలాగ్స్ తో నాని అదరగొట్టాడు. టీజర్ చివరిలో కత్తికి ఉన్న నెత్తుటితో నాని వీర తిలకం పెట్టుకున్న షాట్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. సత్యం సూర్యన్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ని మరో మెట్టు ఎక్కించాయి.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మార్చి 30న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.