English | Telugu

ఎన్టీఆర్..పవన్ కళ్యాణ్ ను కలిపిన ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితులలో ఒకే ఫ్యామిలీలో ఉన్న హీరోలందరిని ఒకే ఫ్లెక్సీలో చూడడం కష్టంగా మారింది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గత కొంతలంగా సపరేట్ గా వుంటున్న విషయం తెలిసిందే. అలాగే నందమూరి ఫ్యామిలీలో బాబాయి, అబ్బాయిల మధ్య పోటీ కూడా తీవ్రమైంది. దీంతో ఆయా కుటుంబలకి చెందిన హీరోల ఫ్యాన్స్ కూడా విడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు కుటుంబాలకి చెందిన హీరోలు ఓకే ఫ్లెక్సీలో కనిపిస్తారని ఎవరైన ఊహిస్తారా? కానీ ఇప్పుడు అదే జరిగింది.తూర్పుగోదావరి జిల్లా ముప్పాడ గ్రామంలో ఇలాంటి చిత్రమైన ఫ్లెక్సీనే దర్శనమిచ్చింది. ఎన్టీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌లను ఒకే ఫ్లెక్సీలోకి ఎక్కించేశారు అభిమానులు. తమ గ్రామస్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఫ్లెక్సీ పెట్టారు ఇద్దరు కుర్రాళ్లు. ఈ ఫ్లెక్సీకి అక్కడ ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందో కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ఈ ఫ్లెక్సీ పెద్ద చర్చనీయాంశమవుతోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.