English | Telugu

గేయరచయితగా మంచు మనోజ్ కుమార్

గేయరచయితగా మంచు మనోజ్ కుమార్ కొత్త అవతారమెత్తాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై, మంచు మనోజ్ కుమార్ హీరోగా, అని (అనిల్ కృష్ణ) దర్శకత్వంలో, డి.యస్.రావు నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "మిస్టర్ నోకియా".ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ కుమార్ లిరిక్ రైటర్ గా అంటే గేయరచయితగా ఒక పాట వ్రాశాడని తెలిసింది. ఈ మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" సినిమాలో కృతి కర్బంద, సనా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" సినిమాకి రాజశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు, ఇళయరాజా కుమారుడు అయిన యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. మంచు మనోజ్ కుమార్ "మిస్టర్ నోకియా" మూవీ సింగిల్ షెడ్యూల్లో పూర్తి కానుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.