English | Telugu

షాకింగ్ నిజాలు బయటపెట్టిన మోహన్ బాబు ఇంటి పనిమనిషి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)ఆయన రెండవ కుమారుడు ప్రముఖ హీరో మనోజ్(manoj)మధ్య ఆస్తులకి సంబంధించిన గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.మోహన్ బాబు అయితే ఏకంగా మనోజ్ వల్ల ప్రాణ హాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగగా, మనోజ్ మాత్రం తనకి ఆస్తులపై వ్యామోహం లేదని, తన భార్య,కూతురు పై కుట్ర పన్నుతున్నారని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది.

రీసెంట్ గా మోహన్ బాబు ఇంట్లో ఎప్పట్నుంచో చేస్తున్న పని మనిషి మాట్లాడుతు మోహన్ బాబు, మనోజ్ కి మధ్య స్టాఫ్ విషయంలో గొడవ జరిగింది.నా స్టాఫ్ ని నువ్వు ఏమనద్దని
మనోజ్ ని మోహన్ బాబు నెట్టగానే మనోజ్ కూడా మోహన్ బాబు ని నెట్టాడు. విష్ణు, మనోజ్ మధ్య కూడా ఎప్పట్నుంచో గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా మౌనిక ని పెళ్లి చేసుకున్నాక పెద్దగా మాటలు లేవు.ప్రస్తుతం మనోజ్,మౌనిక ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయారు.విష్ణు(vishnu)అన్నకి మోహన్ బాబు గారంటే ప్రాణం.ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు.అలాంటిది మనోజ్ నెట్టాడని తెలిస్తే అసలు ఊరుకోడు .మనోజ్ కి పాప పుట్టినప్పుడు కూడా మోహన్ బాబు కుటుంబం లక్ష రూపాయిలు ఇచ్చిందని చెప్పింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.