English | Telugu

మ‌హేష్‌కి డ‌బ్బంటే ఆశ ఎక్కువే సుమీ..?!



తెలుగునాట మ‌హేష్ బాబుది చెక్కు చెద‌ర‌ని క్రేజ్‌. దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారంతా మ‌హేష్‌ని పిచ్చ పిచ్చ‌గా ఆరాధిస్తారు. అందుకే మ‌హేష్ అటు ఇమేజ్‌లోనూ, ఇటు క్రేజ్‌లోనూ.... మొత్తానికి పారితోషికంలోనూ నెంబ‌ర్‌వ‌న్‌. ఎంటార్స్‌మెంట్ల విష‌యంలోనూ మ‌హేష్‌కి పోటీ లేదు. సెక‌న్ల‌పాటు క‌నిపించే యాడ్‌లో క‌నిపించాలంటే కోట్లు ధార‌బోయాల్సిందే. ఆఖ‌రికి అవార్డు ఫంక్ష‌న్ల‌కు రావాల‌న్నా.. మ‌హేష్ అడిగింది ఇవ్వాల్సిందే. ఇప్పుడు తానా వేడుక‌ల్లో పాల్గొన‌వ‌ల‌సిందిగా మ‌హేష్‌కి ఆహ్వానం అందింది. అమెరికాలోని తెలుగువాళ్లంతా క‌ల‌సిక‌ట్టుగా నిర్వ‌హించుకొనే వేడుక‌.. తానా ఉత్స‌వాలు. ఇందుకోసం తెలుగు ప్ర‌ముఖుల్ని ఆహ్వానించి.. అక్క‌డ స‌న్మానిస్తారు. మ‌హేష్‌కి అమెరికాలోనూవిప‌రీత‌మైన క్రేజ్‌. అందుకే ఈసారి మ‌హేష్‌తో ఈ వేడుక నిర్వ‌హించాల‌ని తానా క‌మీటీ భావిస్తోంది. అయితే ఇందుకోసం మ‌హేష్ రూ.3 కోట్లు డిమాండ్ చేశాడ‌ట‌. ఇంత‌కీ అక్క‌డ ఉండాల్సింది మూడు గంట‌లు మాత్ర‌మే. అంటే మ‌హేష్ సంపాద‌న గంట‌కు కోటి అన్న‌మాట‌. వారెవ్వా... మ‌హేషా.. డబ్బంటే ఇంత ఆశా..?? మ‌రి తానా వాళ్లు ఈ బేరం ఎంత‌కు తెగ్గొడ‌తారో చూడాలి.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.