English | Telugu

నా ఆస్తులు తాకట్టులో ఉంటే ఎన్టీఆర్ ఏం చేసారో తెలుసా!

ప్రముఖ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)గత నెల మార్చి 19 న 73 సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.బర్త్ డే వేడుకలు తిరుపతిలోని తన యూనివర్సిటీ లో జరగగా శరత్ కుమార్,ప్రభుదేవా హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మోహన్ బాబు ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa)తో బిజీగా ఉన్నాడు.మంచు విష్ణు(Vishnu) 'కన్నప్ప'గా టైటిల్ రోల్ లో చేస్తుండగా ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(Mohanlal)అక్షయ్ కుమార్(Akshay KUmar)వంటి మేటినటులు కీలక పాత్రలు చేస్తున్నారు.మోహన్ బాబు కూడా ఒక కీలక క్యారక్టర్ లో నటించడంతో పాటు 'కన్నప్ప' కి నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.

మోహన్ బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.అందులో ఆయన మాట్లాడుతు నాకు మొట్టమొదటి అవకాశం దాసరి నారాయణరావు(Dasari Narayanararao)గారు స్వర్గం,నరకంతో ఇచ్చారు.అప్పట్నుంచి ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల క్యారక్టర్ లు వేసాను.కొన్నిసార్లు సినిమాలు ఫెయిల్ అయ్యాయి గాని,నటుడిగా మాత్రం నేను ఫెయిల్ అవ్వలేదు.నిర్మాతగా అన్నగారు నందమూరి తారకరామారావుతో మేజర్ చంద్రకాంత్ నిర్మించడంతో పాటు ఆయన కొడుకుగా నటించాను.నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మేజర్ చంద్రకాంత్ ని తెరకెక్కిస్తుంటే అలా వద్దని ఎన్టీఆర్ వారించారు.కానీ మొండిగా ఆ సినిమా నిర్మించి సక్సెస్ అయ్యాను

నేను ట్రోలింగ్ లని పట్టించుకోను.అలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో నాకు తెలియదు.పక్క వాళ్ళు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోకూడదు.అలా కోరుకుంటే వాళ్ళ కంటే ముందే మనం నాశనం అవుతాం.కోపం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది.నేను ఎవరికీ అపకారం చెయ్యలేదు.నన్నేచాలా మంది మోసం చేశారు.ఒకర్నిమార్చాలని కూడా ఎప్పుడు అనుకోకూడదు.అందరు క్షేమంగా ఉండాలి.దేవుడి దయ వల్ల 'కన్నప్ప'మూవీలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.