English | Telugu

ఎన్టీఆర్ ఔట్‌.. బ‌న్నీ ఇన్‌


శ్రీ‌మంతుడుతో కొర‌టాల శివ‌కు డిమాండ్ బాగా పెరిగింది. సెన్సిబుల్ స్టోరీస్‌ని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్ప‌గ‌ల‌డు అని ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు కొర‌టాల‌. దాంతో అగ్ర హీరోలంతా కొర‌టాల‌పై దృష్టి పెట్టారు. శ్రీ‌మంతుడు త‌ర‌వాత కొర‌టాల ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సింది. ఈ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించ‌నుంది. అయితే.. ఇప్పుడు స‌డ‌న్‌గా ఎన్టీఆర్ ప‌క్క‌కు వెళ్లిపోయాడు. ఆ స్థానంలో అల్లు అర్జున్ వ‌చ్చాడ‌ని వినికిడి. బ‌న్నీకి కొర‌టాల ఇది వ‌ర‌కే ఓ క‌థ వినిపించాడు. ఎందుక‌నో.. ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు.

శ్రీ‌మంతుడు విజ‌యంతో కొర‌టాల‌పై బ‌న్నీకి న‌మ్మ‌కం బాగా పెరిగింది. అందుకే కొర‌టాలని పిలిచి 'మ‌నం సినిమా చేసేద్దాం' అన్నాడ‌ట‌. దాంతో ఈ ప్రాజెక్టు కాస్త ఓకే అయిపోయింది. సుకుమార్ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ ఎన్టీఆర్ ఖాళీ అవ్వ‌డు. ఈలోగా బ‌న్నీతో సినిమా చేసేద్దామ‌ని కొర‌టాల ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. అటు బోయ‌పాటి శ్రీ‌ను, ఇటు కొర‌టాల శివ‌.. ఈ రెండు సినిమాల్నీ స‌మాంత‌రంగా పూర్తి చేయాల‌ని బ‌న్నీ ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇంకొద్ది రోజుల్లో ఈ విష‌యంపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.