English | Telugu

రెండు కోట్ల‌కు ప‌డిపోయిన కాజ‌ల్‌

డ‌బ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్ద‌లు. క‌థానాయిక‌లూ పారితోషికానికే ప‌డిపోతుంటారు. ఇప్పుడు.. కాజ‌ల్ ప‌రిస్థితీ అంతే. స్టార్ హీరోల‌తో త‌ప్ప‌, చిన్నా చిత‌కా హీరోల ప‌క్క‌న న‌టించ‌నుగాక న‌టించ‌ను అని స్ట్రాంగ్ గా ఫిక్స‌యి, చాలా అవ‌కాశాల్ని అలానే వ‌దిలేసింది కాజ‌ల్‌. అయితే అందంతా స్టార్ హోదా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కాదు, అవ‌కాశాలు లేన‌ప్పుడు కూడా ఇదే సూత్రం పాటించింది.

అయితే ఇప్పుడు ఈ ష‌ర‌తుకు కాస్త మిన‌హాయింపు ఇచ్చింది. `అడిగినంత‌ పారితోషికం ఇస్తే ఎవ‌రితో అయినా న‌టిస్తా` అని పిక్స‌యిపోయింది. అందుకే ఇప్పుడు లారెన్స్ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ముని 4 తెర‌కెక్కుతోంది. త‌నే హీరో.

ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌మ‌ని కాజ‌ల్‌ని సంప్ర‌దిస్తే.. `రెండుకోట్లు` డిమాండ్ చేసింద‌ట‌. దానికి లారెన్స్ కూడా ఒప్పుకోవ‌డంతో ఈ సినిమాని ఫిక్స్ చేసేసింది కాజ‌ల్‌. ఇది వ‌ర‌కు లారెన్స్ త‌మ్ముడు సినిమాలో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని సంప్ర‌దిస్తే.. `నో` అనేసింది. పారితోషికం ఎంతిస్తాన‌న్నా.. చేయ‌ను అని చెప్పింద‌ట‌. ఇంత‌లోనే కాజ‌ల్‌లో ఎంత మార్పు..??? రెండు కోట్ల‌కు ప‌డిపోయింది. కోట్లా. మ‌జాకా?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.