English | Telugu

రాజ‌మౌళికి హ్యాండిచ్చిన నాని

ప్ర‌భాస్ అభిమానులే కాదు, యావ‌త్ తెలుగు చిత్ర‌సీమ మొత్తం బాహుబ‌లి కోసం ఎదురుచూస్తోంది. బాహుబ‌లి ఆడియో విడుద‌ల అంటే.. వాళ్లంద‌రికీ పండ‌గే. ఈ కార్య‌క్ర‌మాన్ని కాస్త ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దాల‌నుకొన్నాడు జక్క‌న్న రాజ‌మౌళి. ఈ కార్య‌క్ర‌మం యాంక‌రింగ్ బాధ్య‌త‌లు నానికి అప్పగించాడు. అయితే నాని చివ‌రి క్ష‌ణాల్లో రాజ‌మౌళికి హ్యాండిచ్చాడు. ఆ ప్లేసులో రెగ్యుల‌ర్ యాంక‌ర్ సుమ వ‌చ్చి చేరింది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి కూడా ట్విట్ట‌ర్లో దృవీక‌రించాడు.

ఇటీవ‌ల 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' సినిమా షూటింగ్‌లో నాని కాలికి గాయ‌మైంద‌ట‌. అందుకే నాని రాలేక‌పోయాడ‌ట‌. దాంతో మరో మార్గం లేక‌.. సుమ‌ని హుటాహుటిన తిరుప‌తి ర‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. ఈరోజు సాయింత్రం 7 గంట‌ల‌కు తిరుప‌తిలోన ఎస్వీ యూనివ‌ర్సిటిలో బాహుబ‌లి ఆడియో కార్యక్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు క‌నీసం ఇర‌వైవేల మంది ప్ర‌భాస్ అభిమానులు త‌ర‌లి వ‌స్తార‌ని అంచ‌నా.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.