English | Telugu
జూలై 4న వరల్డ్వైడ్గా వెంకటేష్ ‘దృశ్యం’
Updated : Jul 1, 2014
మలయాళంలో సూపర్ డూపర్హిట్ అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్, మీనా జంటగా మూవీ మొఘల్ డా॥ డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్, రాజ్కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో డి.సురేష్బాబు, రాజ్కుమార్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వెంకటేష్, మీనా జంటగా గతంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్హిట్ అయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న వరల్డ్వైడ్గా విడుదలవుతోంది. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ‘‘నా కెరీర్లో ఇది మరో మంచి చిత్రం అవుతుంది. ఈ చిత్రంలో రాంబాబు అనే సింపుల్ రోల్ చేశాను. ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడు సంగతులు జరుగుతుంటాయి. నచ్చని విషయాలతో ఓ సాధారణ వ్యక్తి ఎలా పోరాడాడు అనేది చిత్ర కథ. శ్రీప్రియగారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.