English | Telugu

చిరు, ప‌వ‌న్‌ల‌తో దిల్‌రాజు సినిమా??

చిరంజీవి ఇప్పుడు పూర్తిగా సినిమాల‌పైనే దృష్టి పెట్టారు. వ‌చ్చే రెండు మూడేళ్లు రాజ‌కీయప‌రంగా స్థ‌బ్దుగా ఉంద‌ని, అందుకే సినిమాల‌పై దృష్టి పెట్టి అభిమానుల్ని అల‌రించాల‌ని కోరుకొంటున్న‌ట్టు చిరు తెలిపారు. అందుకు త‌గిన‌ట్టే ఆయ‌న కోసం క‌థ‌లు రెడీ అవుతున్నాయి. చిరంజీవితో సినిమా చేయాల‌ని నిర్మాత‌లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. త‌న త‌దుప‌రి చిత్రానికి చ‌ర‌ణ్ నిర్మాత అని చిరు ప్ర‌క‌టించ‌డంతో ఆ బెర్తుపై ఎవ్వ‌రికీ ఆశ‌ల్లేవు. కానీ.. ఆ త‌ర‌వాతి సినిమాల కోసం చిరుని ఒప్పించాల‌ని నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

జాబితాలో ముందుగా వినిపించే పేరు దిల్‌రాజు. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఆడియో వేడుక‌లో దిల్ రాజులాంటి నిబ‌ద్ధ‌త క‌ల నిర్మాత‌తో సినిమా చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు చిరు. దాంతో దిల్‌రాజు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఓ సినిమా చేయ‌డానికి తాను స‌న్నాహాలు చేస్తున్నాన‌ని, అన్నీ కుదిరితే ఆ సినిమాలో చిరంజీవి కూడా క‌నిపిస్తార‌ని చెప్పి.. మెగా ఫ్యాన్స్‌ని సంతోష‌పెట్టాడు దిల్‌రాజు.

స‌ర్దార్ త‌ర‌వాత దాస‌రి నిర్మాణంలో ప‌వ‌న్ న‌టించ‌బోతున్నాడు. ఆ త‌ర‌వాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమాలో చిరంజీవి కూడా న‌టిస్తే బాగుంటుంద‌ని, అలాంటి క‌థ కోసం తాను అన్వేషిస్తున్నాన‌ని దిల్ రాజు చెబుతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టి ఇన్నేళ్ల‌యినా చిరంజీవితో క‌ల‌సి న‌టించ‌లేదు. ఆ అవ‌కాశం ఇప్పుడు ఇలా రాబోతోంద‌న్న‌మాట‌. చిరు, ప‌వ‌న్‌ల‌కు స‌రిప‌డ క‌థ‌ని వెదికిప‌ట్టుకోవ‌డం దిల్‌రాజులాంటి మాస్ట‌ర్ బ్ర‌యిన్‌కి పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. చూద్దాం... దిల్‌రాజు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.