English | Telugu

భర్త గెలుపు కోసం అజ్మీర్ లో ధోనీ భార్య ప్రార్థనలు

భర్త గెలుపు కోసం అజ్మీర్ లో ధోనీ భార్య ప్రార్థనలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే భారత దేశానికి క్రికెట్లో 1983లో కపిల్ దేవ్ ప్రపంచ కప్పుని అందించిన తర్వాత మళ్ళీ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు 2011 లో క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఈ క్రికెట్ ప్రపంచకప్ భారతదేశం గెలవటంతో ఆ రోజంతా భారతదేశం మొత్తం కుల,మత,భాషా భేదాలకతీతంగా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంది. మనలో మనకి ఎన్ని తేడాలున్నా ఈ విషయంలోమాత్రం భారతీయులంతా ఒక్కటేనని మరోసారి నిరూపించబడింది.

అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ ఐపియల్ మ్యాచులాడుతున్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున కెప్టెన్ గా ఆడుతుండటంతో అతని టీమ్ గెలవాలనీ, అతనికి కెప్టెన్ గా మంచి పేరు రావాలనీ, అతని భార్య సాక్షి రావత్ ఇటీవల అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిపింది. మరి అజ్మీర్‍ దర్గాలోని దేవుడు సాక్షి రావత్ ప్రార్థనలు విన్నాడో....? లేదో...?

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.