English | Telugu

పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి కాంగ్రెస్ మంత్రులు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి వస్తున్న మొదటి సినిమా 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ పీరియాడిక్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి రానున్న గెస్ట్ ల లిస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటి పవన్ సినిమా వేడుకకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు హాజరు కానున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు రానున్నారని తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేను స్వయంగా నిర్మాత ఎ.ఎం. రత్నం వెళ్ళి అహ్వాహించారు. వీరితో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ హాజరవుతారట.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ పరిశ్రమ నుంచి తక్కువమందే పాల్గొంటారని వినికిడి. దర్శకులు త్రివిక్రమ్, సుజీత్, హరీష్ శంకర్ వంటి వారు హాజరయ్యే అవకాశముంది అంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.