English | Telugu

'గ‌బ్బ‌ర్ సింగ్ 2' ఆగిపోయింది


గ‌బ్బ‌ర్ సింగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిపోయి.... బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ ఖాతాలో చేరిపోయింది. ఆ త‌ర‌వాత ఈ సినిమాకి సీక్వెల్ చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. దానికితోడు హిందీలోనూ ద‌బాంగ్ 2 అంటూ స‌ల్మాన్ భాయ్ హిట్ కొట్టాడు. ఆస్ఫూర్తితో గ‌బ్బ‌ర్ సింగ్ 2కి ముహూర్తం ఖ‌రారై... ద‌ర్శ‌కుడిగా సంప‌త్‌నంది గ‌బ్బ‌ర్ సింగ్ 2 స్ర్కిప్టుని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ప‌వ‌న్ కోసం ఎదురుచూశాడు. తీరా చూస్తే... ప‌వ‌న్ సంప‌త్‌కి హ్యాండిచ్చి ఇంటికి పంపించేశాడు. ఆ త‌ర‌వాత బాబిని రంగంలోకి దింపాడు. గ‌బ్బ‌ర్ సింగ్ 2 క‌థ‌లోనే కొన్ని మార్పులు చేర్పులూ చేశాడు. అయితే ఇది కూడా వ‌వ‌న్‌కి న‌చ్చ‌లేదు.

దాంతో ఆ స్ర్కిప్టు పూర్తిగా ప‌క్క‌న ప‌డేసి... కొత్త క‌థ రాయించాడు. గ‌బ్బ‌ర్ సింగ్ 2 క‌థ‌ని వాడుకోనప్పుడు ఆ టైటిల్ ఎందుకు అనుకొన్నాడేమో... దాన్నీ మార్చేసి స‌ర్దార్ అని నామ‌క‌ర‌ణం చేశాడు. ప‌వ‌న్ ఎత్తుగ‌డ వెనుక రెండు కార‌ణాలున్నాయి. గ‌బ్బ‌ర్ సింగ్ 2 అన‌గానే అభిమానుల్లో అంచ‌నాలు పెరిగిపోతాయి. గ‌బ్బ‌ర్ సింగ్‌తో సినిమాని పోల్చి చూసుకొంటారు. వాటిని అందుకోవ‌డం ఎట్టిప‌రిస్థితుల్లోనూ క‌ష్ట‌మే. అందుకే అంచ‌నాలు త‌గ్గించ‌డానికి ప‌వ‌న్ టైటిల్‌లో మార్పు చేశాడు. రెండోది గ‌బ్బ‌ర్ సింగ్ 2 అనే టైటిల్ పెడితే.. టైటిల్ కోసమే క‌నీసం కోటి రూపాయ‌లు వెచ్చించాలి. ఎందుకంటే ఈ టైటిల్ షోలే నిర్మాత‌ల ద‌గ్గ‌ర ఉంది. ఆ హ‌క్కుల్ని తీసుకొనే గ‌బ్బ‌ర్ సింగ్ అనే టైటిల్ పెట్టారు అప్ప‌ట్లో. ఇప్పుడు మ‌ళ్లీ ఆ టైటిల్ వాడుకోవాలంటే మ‌ళ్లీ మ‌రో కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేయాలి. దాంతో పాటు సంప‌త్ నంది రాసిన సీన్లు వాడుకొంటున్నార‌న్న అప‌వాదు రాకుండా... పూర్తిగా ఆక‌థ‌నీ ఆ పేరునీ లేకుండా చేసేసి త‌న తెలివితేట‌ల్ని చూపించాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.