English | Telugu

అక్కినేని కుటుంబంపై చిరంజీవి ట్వీట్..కొండా మురళితో భేటీ అవుతాడా!

అక్కినేని(akkineni)కుటుంబానికి,చిరంజీవి(chiranjeevi)కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరకి తెలిసిందే.మహా నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు(akkineni nageswararao)మొదలుకొని నేటి అఖిల్ దాకా కూడా ఆ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది.ఈ విషయాన్నీచాలా సందర్భాల్లో ఇరు వైపుల కుటుంబ సభ్యులు బహిరంగంగానే చెప్పారు. నాగార్జున(nagarjuna) కూడా చిరంజీవిని అన్నయ్య అని సంబోదిస్తాడు.

రీసెంట్ గా తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)బిఆర్ఎస్ ఎంఎల్ఏ కేటీఆర్ పై విమర్శలు చేస్తూ నాగచైతన్య(naga chaitanya)సమంత(samantha)లని ఉద్దేశించి లేని పోనీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు వాటిని ఖండిస్తూ చిరంజీవి ట్వీట్ చేసాడు.గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను.సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు. మా సభ్యులపై చేసిన ఇలాంటి దుర్మార్గపు మాటలని అందరం కలిసి వ్యతిరేకిస్తాం.సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు. సమాజాన్ని ఉద్దరించడానికి నాయకులను ఎన్నుకుంటాం.కానీ ఇలాంటి ప్రసంగాలు చేసి ఆ విషయాన్నీ కలుషితంగా మార్చకూడదు. రాజకీయ నాయకులు, గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మంచి ఉదాహరణగా ఉండాలి.ఈ హానికరమైన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పాడు.

చిరు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా నిలవడమే కాకుండా సురేఖ భర్త ప్రముఖ రాజకీయనాయకుడు కొండ మురళి(konda murali)చిరు తో ఈ విషయంపై మాట్లాతాడా అనే చర్చ మొదలయ్యింది.ఎందుకంటే ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తం అక్కినేని కుటుంబానికి అండగా నిలుస్తూ కొండ సురేఖ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది.ఈ నేపథ్యంలోనే చిరంజీవి తో కొండ మురళి భేటీ అవ్వచ్చనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.చిరు గతంలో కాంగ్రెస్ నాయకుడుగా చేసిన విషయాన్నీ కూడా గుర్తు చేస్తున్నారు.


Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.