English | Telugu

ఎమ్మెస్‌ నారాయణ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

అద్భుతమైన నటుడిని కోల్పోయాం- బాలకృష్ణ

ఎమ్మెస్‌ నారాయణ అద్భుతమైన నటుడు. మంచి మిత్రుడు. పలు సినిమాల్లో కలిసి చేశాం. ఆయన మృతిచెందారన్న వార్త మనసును కలచివేసింది. ఈ మధ్య కూడా ‘లయన్‌’లో కలిసి నటించాం. అలాంటి గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

గొప్ప మానవతావాది.. ఆర్ నారాయణ మూర్తి

ఎమ్మెస్ నారాయణ గొప్ప రచయిత, నటుడు అంతే కాకుండా గొప్ప మానవతావాది అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఎమ్మెస్ కోలుకుంటాడని ఆశించానని మూర్తి అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

బాధాకర౦...అలీ

ఎమ్మెస్ నారాయణ మృతి బాధాకరమని ప్రముఖ హాస్యనటుడు అలీ అన్నారు. తామిద్దరం కలిసి వంద సినిమాలు పైగా కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెస్ రచయితగా వచ్చి, నటుడిగా తన మార్కుని ఏర్పరుచుకున్నారని అలీ తెలిపారు. దూకుడుకు అవార్డు వచ్చినప్పుడు ఎమ్మెస్ సంతోషించారని, ఒక అవార్డు వస్తే నటుడికి సపోర్ట్ గా ఉంటుందని ఆయన అన్నారని అలీ వెల్లడించారు. ఎమ్మెస్ కుటుంబానికి అలీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

షాకింగ్ గా ఉంది.. చంద్రబోస్

ఎమ్మెస్ నారాయణ మృతి చాలా షాకింగ్ గా ఉందని, తట్టుకోలేక పోతున్నాని పాటల రచయిత చంద్రబోస్ తెలిపారు. తన తొలి నాళ్లలో రచయితగా పరిచయం అని ఎమ్మెస్ అద్భుత సంభాషణలు రాశారని గుర్తు చేసుకున్నారు. బోసు.. బోసు అని ఆప్యాయంగా పిలుస్తూ, తనను ఎమ్మెస్ కొడుకులా చూసుకునేవారని చంద్రబోస్ చెప్పారు. ఎమ్మెస్ నారాయణ కుటుంబానికి బోస్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మిత్రున్ని కోల్పోయా..రంగనాథ్

మంచి మిత్రున్ని కోల్పోయానని నటుడు రంగనాథ్ అన్నారు. ఎమ్మెస్ నారాయణ సినిమా రంగంలోకి రాకుముందే తమ మధ్య సాన్నిహిత్యం ఉండేదని రంగనాథ్ తెలిపారు. తన కొడుకు, కూతురు పట్ల శ్రద్ధ తీసుకుని ప్రోత్సహిస్తూ తండ్రిగా కూడా పిల్లలకు న్యాయం చేశారన్నారు. ఎమ్మెస్ కుటుంబానికి రంగనాథ్ సానుభూతిని తెలియజేశారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.