English | Telugu

సమంత ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్.. ఆ టాప్ స్టార్ తో...

టాప్ స్టార్స్ కి జోడిగా సమంత(Samantha) నటించి చాలా కాలమైంది. గత కొన్నేళ్లుగా ఆమె ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడమో లేక యంగ్ స్టార్స్ పక్కన నటించడమో చేస్తూ వచ్చింది. ఇక అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది. అలాంటి సమంత ఇప్పుడు షార్ట్ గ్యాప్ తో తెలుగులో అదిరిపోయే రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పక్కన నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నట్లు సమాచారం.

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ఫైనల్ అయినట్లు వినికిడి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. సౌత్ తో పాటు, నార్త్ లోనూ మంచి గుర్తింపు ఉన్న సమంత హీరోయిన్ గా పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావించి మూవీ టీం ఆమె పేరు ఖరారు చేశారట.

అల్లు అర్జున్, సమంత కాంబినేషన్ లో గతంలో 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా వచ్చింది. అందులో వీరి జోడి మెప్పించింది. అలాగే 'పుష్ప' చిత్రంలో 'ఊ అంటావా మావా' స్పెషల్ సాంగ్ లో చిందేసి ఒక ఊపు ఊపింది సమంత. ఓ వైపు విడాకులు, మరోవైపు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో సమంతకు ఆ పాట కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు మరోసారి బన్నీ సరసన నటించడానికి రెడీ అవుతుందట. కాగా డైరెక్టర్ అట్లీ తోనూ సమంత 'తేరి', 'మెర్సల్' అనే రెండు సినిమాలు చేసింది. ఇప్పుడిది వారి కలయికలో మూడో ప్రాజెక్ట్ అవుతుంది.

మరోవైపు ఈ సినిమాలో సమంతతో పాటు త్రిష కూడా అలరించనుందని న్యూస్ వినిపిస్తోంది. ఏప్రిల్ 8న దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.