English | Telugu

లయన్ గర్జించింది..

లయన్ ఆడియో రిలీజ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారకరామారావు అని మాత్రమే కాదన్నారు. ‘ఎన్టీఆర్ లో ఎన్ అంటే నటనాలయం. ఆ ఆలయంలో ఎన్టీఆర్ నటరాజ నటసింహుడు. టి అంటే….తారామండలంలోని నటసింహుడు, ఆర్ అంటే రాజార్షి, రారాజు, కమనీయ సౌమ్య దురందరుడు. అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన భౌతికంగా లేకున్నా ఆయన స్పూర్తిగా ఉంది’ అని కొనియాడారు. నందమూరి బాలకృష్ణ గాలిలో కలిసి పరిగెత్తే వ్యక్తి కాడని చెప్పారు. సింహం వలే ఎప్పుడైనా, ఎక్కడైనా అభిమానుల ఉన్నంత వరకు లయన్ గానే ఉంటానని చెప్పారు. చిత్రపరిశ్రమలోకి చిట్టెలుకలు..చిరుతపులులు వచ్చిన సింహం ఒక్కటే ఉంటుందని అన్నారు. తన జోలికి వస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. తనపై ఎంతో నమ్మకం ఉండబట్టే అభిమానిగా ఉన్న వ్యక్తి నిర్మాతగా మారారని చెప్పారు. వేల లక్షల కోట్లమంది అభిమానాన్ని పొందటం అదృష్టమని, హీరోగానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా అభిమానం సంపాదించుకోవడం సంతోషకరమన్నారు. ''భగవద్గీత యుద్దానికి ముందు వినిపిస్తారు..మనిషి చనిపోయిన తరువాత కూడా వినిపిస్తారు. ముందు వింటావా? తరువాత వింటావా?'' అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతుంటే..ఇక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.