English | Telugu

'తుంగభద్ర'ను చూసిన బాలయ్య

రాజకీయాలు, సినిమాలతో బిజీగా గడుపుతున్న నందమూరి బాలయ్యకు కొంచెం ఖాళీ సమయం దొరకడంతో సినిమా చూడాలని డిసైడ్ అయ్యారట. తన లెజెండ్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి నిర్మించిన 'తుంగభద్ర' సినిమా కథ నచ్చడంతో తాను ఫ్యామిలీతో సహా చూస్తానని అన్నారట. దీంతో ఆయన బాలయ్య కోసం ప్రత్యేకంగా షో అరేంజ్ చేసారట. సినిమా చూసిన బాలయ్య, టేకింగ్ ను, కొత్త దర్శకుడిని తెగ మెచ్చుకున్నారట. మంచి సినిమాను నిర్మించావని నిర్మాత సాయి కొర్రపాటిని తెగ పొగిడేశారట. బాలయ్య అంతటి వాడు కితాబు ఇచ్చేసరికి సాయి కొర్రపాటి సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా వున్నాడట. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దం చేస్తున్నాడు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.