English | Telugu

ఒంగోలుకు అతిథిగా బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఒంగోలుకు అతిథిగా రావడమెంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే వుందండీ అసలు ట్విస్ట్!! బాలకృష్ణ ఒంగోలు రాబోతున్న మాట నిజమే కానీ ఒంగోలుకు అతిథిగా కాదు..ఒంగోలులో జరగబోయే సినిమా ఆడియో ఫంక్షన్ కి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ఇది ఒంగోలులో వున్న నందమూరి అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి.

ప్రస్తుతం రాజకీయాలు సినిమాలతో బిజీగా గడుపుతున్న బాలయ్య, అదీ ఇతర హీరో ఆడియో ఫంక్షన్ కోసం ఒంగోలు వరకు వస్తున్నాడంటే ఆ హీరో ఎంత లక్కీయో చెప్పొచ్చు. తన సొంత ఊరు ఒంగోలులో జరగబోయే ‘సౌఖ్యం’ సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాలని గోపిచంద్ బాలయ్య కలిసి ఆహ్వానించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ ఆడియో ఫంక్షన్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఈ నెల 13న ‘సౌఖ్యం’ ఆడియో విడుదల కాబోతోంది. రెజీనా కథానాయికగా నటించిన ‘సౌఖ్యం’ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.