English | Telugu

మోస్ట్ అవైటెడ్ ‘అమరావతి ఫైల్స్’ అన్ సెన్సార్డ్ వెర్షన్ వచ్చేసింది!

ఐదేళ్ళ జగన్ అరాచక పాలనలో అన్యాయానికి గురైన అమరావతి రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా భాను దర్శకత్వంలో ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘అమరావతి ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు. సినిమా నిర్మాణమంటేనే కత్తిమీద సాములాంటిది. అలాంటిది అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా, అధికార పార్టీ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఒక సినిమాని నిర్మించాలంటే ఎంత కష్టమైన విషయమో ఊహించవచ్చు. ‘అమరావతి ఫైల్స్’ సినిమా నిర్మాణానికి జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసింది. జగన్ సైకో ప్రభుత్వం అమరావతి రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ‘అమరావతి ఫైల్స్’ సినిమా నిర్మాణం విషయంలో కూడా అన్ని ఇబ్బందులు పెట్టింది. ఈ సినిమా నిర్మాణాన్ని ఆపించడానికి ఎన్నో అనైతిక దారుల్లో ప్రయత్నించింది. అయినప్పటికీ నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా సినిమా నిర్మాణాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేశారు. అమరావతి ప్రాంత రైతుల అంతరాత్మను ఆవిష్కరించే విధంగా అద్భుతంగా రూపొందిన ‘అమరావతి ఫైల్స్’ చిత్రానికి సెన్సార్ సమయంలోనూ, విడుదల సమయంలోనూ జగన్ ప్రభుత్వం సమస్యలు సృష్టించింది. అనేక కతెర గాటులకు చిత్రాన్ని గురిచేసింది. టైటిల్ విషయంలో కూడా అభ్యంతరం లేవనెత్తింది. అమరావతి రాజధాని ప్రాంత రైతుల గుండె చప్పుడుగా రూపొందిన ఈ చిత్రానికి ‘అమరావతి ఫైల్స్’ అనే టైటిల్ వుండకూదంటూ సైకో జగన్ ప్రభుత్వం పట్టుబట్టింది. ఈ విషయంలో కంఠంనేని రవిశంకర్ ఎంతో పోరాటం చేశారు. అయితే రాజుకంటే మూర్ఖుడు చాలా బలవంతుడు అంటారు. అప్పట్లో రాజు కూడా సాక్షాత్తూ మూర్ఖుడే. దాంతో ఈ సినిమా టైటిల్‌కి ‘రాజధాని ఫైల్స్’గా మార్చక తప్పలేదు.


ఇక విడుదల సమయంలో కూడా జగన్ చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాకి మంచి థియేటర్లు దొరక్కుండా చేశారు. ఒక దశలో విడుదల ఆపడానికి కూడా ప్రయత్నించారు. అయితే, నిర్మాత కంఠంనేని రవిశంకర్ మడమతిప్పని పోరాటం చేసి విడుదల చేశారు. ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలయ్యాక సంతృప్తికరమైన ప్రేక్షకాదరణను ఈ సినిమా సొంతం చేసుకుంది. కమర్షికల్ లెక్కల సంగతి అలా వుంచితే, ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని, అమరావతి రైతుల ఆవేదనను సరైన సమయంలో సరైన రీతిలో ఆవిష్కరించారనే అభినందనలు భారీ స్థాయిలో అందాయి. నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఈ సినిమాని మట్టి మీద అభిమానంతో నిర్మించారే తప్ప, మనీ ఆశించి కాదు. ‘రాజధాని ఫైల్స్’ కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బుని నేలతల్లి కోసం ఖర్చు పెట్టినట్టుగా ఆయన భావించారు. థియేటర్ల ద్వారా ప్రజలకు చేరువైన ‘రాజధాని ఫైల్స్’ ఆ తర్వాత యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రతి తెలుగు గడపనూ పలకరించింది. ప్రతి తెలుగువాడి చేతితో కరచాలనం చేసింది.

అమరావతి రాజధాని విషయంలో జగన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ఈ సినిమా ప్రజల ముందుకు చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళింది. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోవడానికి దోహదం చేసిన అనేక అంశాలలో ‘రాజధాని ఫైల్స్’ సినిమా కలిగించిన ప్రభావం కూడా ఒకటి అనే ప్రశంసలు అందాయి. ఆ విధంగా ఎంతో శ్రమించిన నిర్మించిన ఈ సినిమా ప్రయోజనం నెరవేరినట్టు అయింది. మట్టిమనుషులను అవమానించిన జగన్ నోట మట్టి కొట్టడానికి నిర్మాత కంఠంనేని రవిశంకర్ చేసిన కృషి ఫలించింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రాక్షస పాలన లేదు. ఇంతకాలం అంధకారంలో వున్న రాజధాని అమరావతి ఇప్పుడు మళ్ళీ రెక్కలు విప్పుతోంది. అంతర్జాతీయ స్థాయికి ఎగరడానికి, ఎదగడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బలవంతంగా పేరు మార్పిడికి, కత్తెర గాటుకి గురైన ‘అమరావతి ఫైల్స్’ చిత్రం కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి ‘రాజధాని ఫైల్స్’ అని కాకుండా ‘అమరావతి ఫైల్స్’ పేరుతో తెలుగు ప్రజల ముందు సగర్వంగా, సగౌరవంగా నిలబడింది. కత్తెర గాటుకి గురికాని ‘అమరావతి ఫైల్స్’ పూర్తి నిడివి చిత్రం ‘తెలుగువన్’ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులకు అందుబాటులో వుంది. అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని చరిత్రలో నిలిపేలా చేసి, చరిత్ర సృష్టించిన ‘అమరావతి ఫైల్స్’ మీ అభినందనలు అందుకోవడానికి యూట్యూబ్‌లో ఎదురుచూస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.