English | Telugu

అల్లు అర్జున్ విదేశాలకి వెళ్ళవచ్చు 

పుష్ప 2(Pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్(Allu Arjun)పై పోలీసు కేసు నమోదయిన విషయం తెలిసిందే.ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లడం,హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆ తర్వాత నాంపల్లి కోర్టు పూచీకత్తుతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం తెలిసిందే.కాకపోతే ప్రతి ఆదివారం పోలీసుల విచారణకు హాజరవ్వాలని కూడా తన తీర్పులో స్పష్టం చేసింది.

కానీ భద్రత కారణాల దృష్ట్యా ప్రతి ఆదివారం విచారణకి హాజరు కాలేనని అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసాడు.దీంతో విచారించిన కోర్టు పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలన్న నిబంధన నుండి మినహాయింపుని ఇస్తు తన తీర్పుని ప్రకటించింది.విదేశాలకు వెళ్లేందుకు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు.రేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఈ రోజే తీర్పు రావడం గమనార్హం.

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 తో రికార్డు కలెక్షన్స్ ని సృషించాడు. హిందీ లో అయితే ఏకంగా అక్కడి హీరోలకి కూడా సాధ్యం కానీ రీతిలో కలెక్షన్స్ ని సృష్టిస్తున్నాడు. రీసెంట్ గా ముంబై వెళ్లి భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు సంజయ్ లీల బన్సాలీని కలవడం ఇప్పుడు ఇండియా సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.