English | Telugu

అల్లు అర్జున్‌ కి రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు..కానీ ఆదివారం మాత్రం

డిసెంబర్ 4 న పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం తెలిసిందే.ఈ విషయంపై పోలీసులు అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్,సంధ్య థియేటర్ యాజమాన్యం తో పాటు పలువురి పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రోజు జైలు లో కూడా ఉన్నాడు.

ఇక ఈ కేసులో అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే.దీంతో రెగ్యులర్ బెయిల్‌ కోసం అల్లు అర్జున్ తరుపు లాయర్లు నాంపల్లి కోర్టులో పిటిషన్ వెయ్యగా కోర్టు తీర్పుని ప్రకటించింది.50 వేల రూపాయలు,ఇద్దరి సాక్ష్య సంతకాలతో అల్లు అర్జున్(allu arjun)కి రెగ్యులర్ బెయిల్ ని ఇస్తూ కోర్టు తీర్పుని ప్రకటించింది.అల్లు అర్జున్ కి ఈ తీర్పు పెద్ద ఊరటని ఇచ్చే అంశమని చెప్పవచ్చు. ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటు కూడా కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.అదే విధంగా సాక్షులను ప్రభావితం చెయ్యడం గాని,కేసుని ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడటం కానీ చేయవద్దని కూడా న్యాయస్థానం తన తీర్పులో వెల్లడి చెయ్యడం జరిగింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.