English | Telugu

‘అఖిల్’ కోసం వినాయక్ రాజీపడట్లేదు

వినాయక్ ‘అఖిల్’ సినిమా విషయంలో ఏమీ రాజీ పడట్లేదు. ‘అఖిల్’ సినిమాలో కూడా అదనపు ఆకర్షణలకు కొదవె లేదట. సెట్ల విషయంలో భారీ హంగామా ఉంటుందట. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ ఈ సినిమా కోసం ఏకంగా ఎనిమిది సెట్లు వేసినట్లు సమాచారం. అవన్నీ కూడా చాలా భారీగానే ఉంటాయట. పాటలతో పాటు ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ అంతా సెట్లలోనే సాగిందట. ఈ సెట్లకు కోట్లల్లోనే ఖర్చయిందని సమాచారం. ఐతే అఖిల్ కు ఉన్న క్రేజ్.. ‘అఖిల్’ సినిమా మీద ఉన్న హైప్ ప్రకారం చూస్తే ఈ ఖర్చు పెద్ద ప్రాబ్లెం అయ్యే అవకాశమేం లేదు. ఈ సినిమాకు ఇప్పటికే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని.. నిర్మాత నితిన్ ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ తో ఉన్నాడని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రమాదమేమీ లేదన్నట్లే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.