English | Telugu

L2 ఎంపురాన్ కి సంబంధించిన అసలు నిజం బయటపడింది..ఎంత డబ్బు పెట్టారో తెలుసా!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కాంబోలో తెరకెక్కిన 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan)మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీకి ఎంత బడ్జెట్ ఖర్చయిందనే విషయాన్నీ చిత్ర నిర్మాతలు ఎక్కడా వెల్లడి చెయ్యలేదు.

కానీ ఇప్పుడు రీసెంట్ గా ఎంపురాన్ బడ్జెట్ ని నిర్మాతలు అధికారకంగా వెల్లడి చేసారు. మలయాళ సినీ ఇండస్ట్రీ లోనే ఫస్ట్ టైం 175 కోట్ల బడ్జెట్ తో రూపొందినట్టు చెప్పుకొచ్చారు. మలయాళ చిత్ర సీమలో మార్చి నెలలో పదిహేను సినిమాలు విడుదలవ్వగా ఎంపురాన్ మాత్రమే విజయాన్ని సాధించిందని, వసూళ్ల పరంగాను 262 కోట్ల రూపాయలకి పైగా కలెక్ట్ చేసి మలయాళ చిత్ర సీమలోనే హయ్యస్ట్ గ్రాసర్ సాధించిన మూవీగా కూడా నిలిచిందని చెప్పారు. కేరళ చలన చిత్ర నిర్మాతల సంఘం కూడా ఈ విషయాన్నీ వెల్లడి చేసింది.

లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఎల్ 2 ఎంపురాన్ ని గోకులం గోపాలన్, ఆంథోనీ పెరంబవూర్, సుభాస్కరన్ నిర్మించారు. మంజు వారియర్, అభిమన్యు సింగ్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించగా దీపక్ దేవ్ సంగీతాన్ని అందించాడు. పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వంతో పాటు ఒక కీలక పాత్ర చెయ్యగా, ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి వేదికగా జియో హాట్ స్టార్(Jio Hot star)లో స్ట్రీమింగ్ అవుతుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.